Tuesday, July 28, 2015

శ్రీ విద్యానికేతన్ ...మరో శాంతినికేతన్ అని కలాంగారు అన్నారు – మోహన్ బాబు



దేశంలోని ఎంతో మంది యువతకు కలాంగారు ఆదర్శప్రాయుడు. తన శాస్త్ర విజ్ఞానంతో మన దేశానికి ప్రపంచంలో గుర్తింపును తెచ్చారు. స్వయంకృషితో అత్యున్నత స్థానానికి ఎదిగారు. ఎంత ఎదిగినా నిరాడంబరంగా ఉండటం ఆయనకే చెల్లుతుంది. యువతను ప్రేరేపిస్తూ వారే దేశాన్ని ముందుండి నడిపించాలనేవారు. ఏ అవార్డులు చేపట్టినా,పదవులు అలంకరించినా వాటికి వన్నె తెచ్చారు. అందరిలో ఆయన రగిలించిన స్ఫూర్తి మరచిపోలేం. ఆయనతో నాకు మంచి అనుబంధం ఉంది. 2009లో మార్చి 19న శ్రీ విద్యానికేతన్ ను ఆయన సందర్శించి ఒక ఇక్కడ వాతావరణం ఒక శాంతినికేతన్ లా ఉంది. చాలా ప్రశాంతంగా దేవాలయంలా ఉందని అనడమే కాకుండా శ్రీ విద్యానికేతన్ వంటి విద్యా సంస్థను నిర్వహిస్తున్నందుకు నన్ను అభినందించారు. అటువంటి ఉన్నత వ్యక్తిమేధావి మనల్ని విడిచిపెట్టి వెళ్లి పోవడం తీరనిలోటు. ఆయన ఆత్మకి శాంతి కలగాలని ఆ సాయినాథునివెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను.  






No comments:

Post a Comment