ఈ సందర్భంగా దిల్రాజు మాట్లాడుతూ... ‘‘బాహుబలి’ వంటి మెగా బ్లాక్బస్టర్ తర్వాత నైజాంలో మేం డిస్ట్రిబ్యూట్ చేస్తున్న సినిమా ‘సినిమా చూపిస్త మావ’. ఈ సినిమా గురించి గత కొన్ని వారాలుగా వింటూనే ఉన్నాను. దాంతో సినిమా చూపించమని నిర్మాతలను అడిగితే` సినిమా పట్ల చాలా కాన్ఫిడెంట్గా ఉన్న ప్రొడ్యూసర్స్ నాకు సినిమా చూపించారు. వాళ్లూ వీళ్లూ చెప్పిన మాట ద్వారా` ‘సినిమా చూపిస్త మావ’ చిత్రంపై కొంత ఎక్స్పెక్టేషన్తో సినిమా చూసిన నేను.. సినిమా చూసి స్పెల్బౌండ్ అయిపోయాను. ఇటీవకాంలో ఓ చిన్న సినిమా ఇంత వండర్ఫుల్గా రావడం జరగలేదు. వెంటనే మా శిరీష్ను కూడా చూడమని చెప్పాను. తనకి కూడా విపరీతంగా నచ్చేసింది. సెకండ్ ధాట్ లేకుండా.. ప్రొడ్యూసర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్న మొత్తానికి.. నైజాం ఏరియా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకొన్నాను. ఈ సందర్భంగా ‘సినిమా చూపిస్త మావ’ నిర్మాతతోపాటు డైరెక్టర్ త్రినాధరావు నక్కిన, మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్చంద్ర, డైలాగ్ రైటర్ ప్రసన్నకుమార్ తదితరును మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. రాజ్తరుణ్-అవికాగోర్ నటించిన ‘ఉయ్యాల జంపాల’ కంటే.. వాళ్లిద్దరూ రెండోసారి కలిసి నటించిన ‘సినిమా చూపిస్త మావ’ మరింత పెద్ద విజయం సాధించడం ఖాయం’ అన్నారు.
అంజిరెడ్డి ప్రొడక్షన్స్-ఆర్.డి.జి ప్రొడక్షన్స్ ప్రై॥లి॥ సంయుక్త సమర్పణలో ఆర్యత్ సినీ ఎంటర్టైన్మెంట్స్తో కలిసి లక్కీ మీడియా పతాకంపై బోగాది అంజిరెడ్డి-బెక్కెం వేణుగోపాల్ (గోపి)-రూపేష్ డి.గోహిల్-జి.సునీత సంయుక్తంగా నిర్మిస్తున్న ‘సినిమా చూపిస్త మావ’ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. మధుర ఆడియో ద్వారా విడుదలైన ఈ చిత్రంలోని పాటలు విశేష ఆదరణ పొందుతున్న విషయం తెలిసిందే!!
No comments:
Post a Comment